<no title>

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ జనవరి మొదట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇలాంటి వారిని ఉత్తరప్రదేశ్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లోని మా ప్రభుత్వాలు కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పారేశాయి’ అని వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ మాట్లాడుతూ ‘ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న లక్షలాది మంది రేపు మీ ఇళ్లలో జొరబడి మీ చెల్లెళ్లను, మీ కూతుళ్లను రేప్‌ చేసి, చంపేస్తారు. రేపటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని గెలపించాలో ఢిల్లీ వాసులు గట్టిగా ఆలోచించాలి’ అని పిలుపునిచ్చారు.